కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్వీన్ కాలనీ డివిజన్ లాస్ట్ బస్టాప్ లో బీజేపీ జెండా దిమ్మను కూల్చిన మునిసిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజిత్ వర్మ తదితర బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమతకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ జెండా దిమ్మగద్దెను కూల్చడం ఈ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, పార్టీ జెండా గద్దెలను కూల్చడం వెనక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.