26.7 C
Hyderabad
May 3, 2024 10: 48 AM
Slider రంగారెడ్డి

బీజేపీ జెండా కూల్చిన వారిపై చర్యలకు డిమాండ్

#BJP

కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్వీన్ కాలనీ డివిజన్ లాస్ట్ బస్టాప్ లో బీజేపీ జెండా దిమ్మను కూల్చిన మునిసిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజిత్ వర్మ తదితర బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమతకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ జెండా దిమ్మగద్దెను కూల్చడం ఈ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, పార్టీ జెండా గద్దెలను కూల్చడం వెనక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Related posts

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇజ్రాయెల్ లో ప్రయత్నాలు

Bhavani

డా. ఈడ్పుగంటి పద్మజా రాణికి తెలంగాణ ప్రభుత్వం సన్మానం

Satyam NEWS

మృతి చెందిన కార్మికురాలికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నివాళి

Bhavani

Leave a Comment