36.2 C
Hyderabad
May 14, 2024 15: 56 PM
Slider ముఖ్యంశాలు

రాబోయే రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు

#someshkumarias

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే  రెండు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి  భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను అప్రమత్తం చేశారు. 

సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి డిజిపి మహేందర్ రెడ్డి, సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి అందరూ జిలా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రాణ హాని, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో సమన్వయం చేసుకొని  లోతట్టు ప్రాంతాలు, వాగులు, బ్రిడ్జ్ లు, బలహీనంగా ఉన్న చెరువులను గుర్తించి తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూలు జిల్లా జిల్లా కలెక్టర్ మనుచౌదరి  మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు.  మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని, పొంగి ఊర్లుతున్న వగులను ప్రజలు, వాహన దారులు దాటకుండా చూడాలని, అవసరమైతే అలాంటి వాటిని గుర్తించి  అటు వైపు వెళ్లకుండా రోడ్డు మళ్లించాలని పోలీస్ శాఖను సూచించారు. 

గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, పంచాయతి సెక్రెటరీలు, మండల అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఇందుకు తగు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

ఈ వీడియో కాన్ఫెరెన్సు లో డీఎస్పీలు మోహన్ రెడ్డి, గిరిబాబు, నరసింహులు, డీపీఓ రాజేశ్వరి, ఇరిగేషన్ అధికారులు మురళి, పార్థసారథి, సంజీవరావు, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రపంచ మాంద్యంలోనూ పెరుగుతున్న ఎగుమతులు

Satyam NEWS

ధార్మిక విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం విధి

Bhavani

తెలంగాణ లో పాఠశాలలకు మళ్లీ కరోనా దెబ్బ

Satyam NEWS

Leave a Comment