దేశమంతటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కడువైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ పుణ్య క్షేత్రాలలోనూ ఇస్కాన్ ఆధ్వర్యంలో నూ ఈ వేడుకలు జరుగగా….పలు ఆశ్రమాలలో కూడా జరిగాయి.
ఇందులో భాగంగా విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలసలో శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీస్వామి రామానంద ప్రియ శిష్యులు రీటైర్డ్ ఆర్జేడీ బ్రహ్మర్షిశ్రీ గురూజీ డాక్టర్ వెంకటేశ్వరరావు సమక్షంలో ఆశ్రమంలో శ్రీకృష్ణాష్ఠమి సందర్భంగా ఉదయం సద్గురు పూజతో పాటు శ్రీకృష్ణ సహస్రం ,సద్గురు పాదుకాస్తవం ,దక్షిణామూర్తి స్తోత్రం, శ్రీ గురుగీత..పఠించారు.
అనంతరం ఎన్ఆర్ఐ శిష్యురాలు ఉషా భారతి నేతృత్వంలో ఆన్ లైన్ ద్వారా శ్రీ గురూజీ బౌధ్ధిక్ ప్రారంభమైంది. ప్రారంభ పరిచయాన్ని శ్రీ గురూజీ ఆదేశాలతో….శ్రీ స్వామి రామానంద శిష్యులు డాక్టర్ హరగోపాల్ శ్రీ కృష్ణ జననం తద్వారా శుక బ్రహ్మర్షి..వ్యాసుల వారి గురించి ప్రస్తావిస్తూ బాగవతాన్ని సూక్ష్మంగా ప్రవచించారు.
అనంతరం శ్రీ గురూజీ బౌధ్ధిక్ ఉపన్యాసం ఇచ్చారు. రాత్రి 12 గంటలకు… శ్రీకృష్ణ జననం కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన గుగ్గిల్లు ,పరవన్నం..మహా ప్రసాదంగా నైవేద్యం పెట్టి శ్రీకృష్ణ జననం పూజ వైభవంగా పూర్తి చేసారు. ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల నుంచీ శిష్యులు పాల్గొన్నారు.