తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పాఠశాలల మీద పెను ప్రభావం చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ పాఠశాలలను బంద్ చేస్తారా అనే చర్చకు తెరలేచింది.
తెలంగాణలోని పలు స్కూళ్లలో ఇప్పటి వరకు 103 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం 6 వ తరగతి నుంచి తరగతులు అవుతున్నాయి. కరోనా పెరగడంతో 6 నుంచి 8 తరగతులకు స్కూళ్లు బంద్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిసింది.
ఈ ఏడాది కూడా 1 నుంచి 8 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు సమాచారం.