ఏపీ డిప్యూటీ సీఎం… సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర…ఈ సాయంత్రం హాడావుడిగా విజయనగరం లో కనిపించారు. వైజాగ్ నుంచీ సరాసరి తన నియోజకవర్గ వర్గమైన సాలూరు వెళుతూ మార్గ మధ్యలో విజయనగరం లో కాస్సేపు ఆగారు. ఈ మేరకు నగరంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్… ఆగ్రోస్ వద్ద ఉన్న స్వామి కంటి హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడే తన కళ్లకు సంబంధించి కొత్త కళ్లద్దాలు కోసం వెళ్లినట్లు తెలిసింది.
అక్కడే హాస్పిటల్ వర్గాలతో కాస్సేపు మాట్లాడారు. అక్కడ నుంచీ సాలూరు పయనమవుతూ మార్గమధ్యలో…తానెప్పుడో దర్శించుకున్న ఆంజనేయ స్వామి కోవెలకు వెళ్లారు. ఈ మేరకు ఎత్తు బ్రిడ్జి వద్ద గజపతినగరం వెళ్లే దారిలో అలకానంద కాలనీ సమీపంలో కుడివైపు చాలా ఏళ్ల క్రితం వెలసిన అంజనేయ స్వామి టెంపుల్ కు వెళ్లారు.
అక్కడే చిన్నగా వెలసిన టెంపుల్ ను దర్శించుకున్నారు. అక్కడే కాసేపు ఉండి..ఆలయ నిర్మాణం గురించి తెలుసుకున్నారు. ఆలయం నుంచి వెళ్లిపోతూ హుండీ లో రెండు వేల నోటు వేశారు. మళ్ళీ వస్తానని ఆలయ అభివృద్ధి కి చేయూత నిస్తానని అక్కడ నిత్య పూజలు చేసే పెద్దావిడకు చెప్పారు.. డిప్యూటీ సీఎం రాజన్న దొర. తాను గతంలో ఈ టెంపుల్ ను సందర్శించానని..అప్పుడు కేవలం విగ్రహం మాత్రమే ఉండే దన్నారు.
అనతికాలంలోనే చిన్న కోవెల కట్టారని…ఆలయ అభివృద్ధి కి తన వంతు సహాయం ఇస్తానని డిప్యూటీ సీఎం ఆమె తో అన్నారు. అయితే స్వామి కంటి హాస్పిటల్ నుంచీ వెళుతూ వెళుతూ…అకస్మాత్తుగా ఆగడంతో ఆయన కారు వెనకాలే సెక్యురిటీ వెహికిల్స్ ఆగడంతో ఎత్తు బ్రిడ్జి దిగువ పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ప్రోటోకాల్ వెహికిల్ అలాగే పైలట్ వెహికిల్ ఎస్ఐ గా ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు కాస్త ముందు కు వెళ్లడంతో వెనకాల వస్తున్న డిప్యూటీ సీఎం వెహికిల్ ఆగడం చూసి.. ముందు కెళ్లి..మళ్లీ వెనక్కు వచ్చారు.
అప్పటికే ట్రాఫిక్ ఆగిపోవడంతో.. డిప్యూటీ సీఎం సెక్యూరిటీ సిబ్బందే ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేశారు. అంతలోనే ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి పూర్తిగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. అంతలోనే డిప్యూటీ సీఎం రాజన్న దొర…అంజన్నను దర్శించుకోవడం..ఆ పై అక్కడకు వచ్చిన సత్యం న్యూస్. నెట్ ప్రతినిధి తో..ఆలయ అభివృద్ధి కి తనవంతు సాయం చేస్తానని…గతంలో ఈ టెంపుల్ ను దర్శించుకున్నానని…వైజాగ్ నుంచీ తన నియోజకవర్గం వెళుతూ..ఇక్కడ కు రావడం జరిగిందన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా