ఏటి మన ఎమ్మెల్యే ఏనే….ఇజయనగరం ఎమ్మెల్యే స్వామన్నే…ఏటి ఇంత జనం..ఇంత ఊరేగింపు…ఏటీ..మంత్రి పదవి వచ్చేసినందుకా…ఏటీ అందుకు…ఈ హంగు…ఆర్బాటాలా..? ఈ బాణా సంచానా…మరి ప్రయాణిస్తున్న మా సంగతేంటి..బస్సుల్లో వస్తున్న మేము…ఇలా ట్రాఫిక్ లో ఇరుకుని…గంటల తరబడి నిరీక్షించాల్సిందేనా….? ఇవి…ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తొలిసారిగా విజయనగరానికి వచ్చిన సందర్బంగా వచ్చిన కాన్వాయ్ సందర్బంగా మామూలు జనంతో పాటు బస్సులలో విజయనగరానికి వస్తున్న ప్రయాణీకులు ఆవేదన.
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల రాక సందర్బంగా నిర్వహించాల్సిన బందోబస్తుపై జిల్లా ఎస్పీ మూడు సార్లు సమీక్ష సమావేశం నిర్వహించినా కూడా..ట్రాఫిక్ క్రమబద్దీకరణలో కాస్త లోపం కనిపించిందనటానికి పైన ఉదహరించిన మాటలే అందుకు నిదర్శనం.నిర్ణీత సమయానికి డిప్యూటీ స్పీకర్ చెల్లూరుకు వచ్చినా…విజయనగరం వైఎస్ఆర్సీపీ నేతలు. అయిన కౌశిక్,రాజేష్,బంగారు నాయడు వంటి నేతల ఆధ్వర్యంలో చెల్లూరు నుంచీ బారీ ర్యాలీగా డిప్యూటీ స్పీకర్ కోలగట్లను తీసుకువచ్చారు.
హెలికాప్టర్ ద్వారా పూల వర్షంతో స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్సీపీ జిల్లా కలెక్టర్ నుంచీ అటు ఏవియేషన్ నుంచీ అనుమతి పొందినప్పటికి…ఆచరణలో మాత్రం..లోపభూయిష్టంగానే కనిపించింది.విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ నుంచీ సీఐ నుంచీ ఎస్ఐ ర్యాంక్ అధికారులంతా బందోబస్తులోనిమగ్నైనా కూడా…బస్సులో ప్రయాణీకులకు కాస్త ఇబ్బంది,అసహనం కలిగించింది..డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ర్యాలీ.నగరంలోని వైజంక్షన్ నుంచీ వీటీ అగ్రహరం..ఎత్తుబ్రిడ్జి వద్ద వచ్చేసరికి రమారమి ఒంటిగంటన్నర అయ్యింది.
అక్కడ నుంచీ జేడ్పీ,రైల్వే స్టేషన్, సీఎంఆర్, కన్యకాపరమేశ్వరి కోవలకు వచ్చేసరికి దాదాపు రెండు గంటలు పట్టింది.ఈ సమయంలోనే ఆకాశంలో హెలికాప్టర్..ద్వారా బంతిపూల వర్షం కురిపించే ఏర్పాట్లు చేసింది..వైఎస్ఆర్పీపీ.ఏదైనా రెండోసారి మంత్రి వర్గవిస్తరణలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్లకు క్యాబినెట్ ర్యాంక్ అయిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడంతో…అటు కోలగట్ల వర్గంతో పాటు…ఏకంగా ఉత్తరాంద్రలో…వైఎస్ఆర్పీపీకి మరి ఎదురులేదు అన్నట్టుగా సీఎం జగన్ రెండోసారి మంత్రి వర్గ విస్తరణ చేయించారనే అని అంటోంది…సత్యం న్యూస్.నెట్.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా