39.2 C
Hyderabad
May 3, 2024 12: 29 PM
Slider నిజామాబాద్

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ

#pocharam

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జల్లపల్లి ఆబాది, జల్లపల్లి, జల్లపల్లి ఫారం లలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

ముఖ్య అతిధిగా పాల్గొన్న స్పీకర్ తో బాటు నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ అని అన్నారు.

పేదల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో లేవని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఇళ్ళు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయ్యాయి.

మెజారిటీ ఇళ్ళ నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. త్వరలోనే మూడు లక్షల రూపాయల స్కీం వస్తుంది.  అర్హులైన వారందరికీ ఇంటిని మంజూరు చేయిస్తాను అని స్పీకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది.

పంట పెట్టుబడి కోసం రైతుబంధు ద్వారా ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తుంది. రైతులకు రూ. 5 లక్షల రైతు బీమా అమలు చేస్తుంది. పండిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. స్వంత భూమి లేని పేదల కోసం 16000 ఎకరాల NSF భూములను పంచి ఇచ్చాం. రైతులు ఈ భూములను అమ్ముకోవద్దు. తమ బతుకు తెరువుకు ఈ భూములు ఉపయోగపడుతాయి అని ఆయన అన్నారు. కోటగిరి మండలం లోని పోతంగల్ గ్రామంను త్వరలోనే నూతన మండలంగా ప్రకటిస్తారని స్పీకర్ తెలిపారు.

ఈ రోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు

జల్లపల్లి ఫారం లో 43 డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రారంభం

జల్లపల్లి ఫారం లో 20, జల్లపల్లి ఆబాది లో 20 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు శంకుస్థాపన

జల్లపల్లి ఫారం లో రూ. 60 లక్షలతో నిర్మించిన సిసీ రోడ్లు ప్రారంభం

రూ. 7 లక్షలతో నిర్మించిన SC కమ్యునిటీ హాల్ ప్రారంభం

రూ. 28 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు ప్రారంభం

రూ. 4 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం ప్రహారి గోడ ప్రారంభం

జల్లపల్లి గ్రామంలో రూ. 3 లక్షలతో నిర్మించిన గ్రావెల్ రోడ్డు ప్రారంభం

రూ. 9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభం

జల్లపల్లి ఆబాది లో రూ. 50 లక్షలతో నిర్మించిన సిసీ రోడ్లు ప్రారంభం

జల్లపల్లి లో రూ. రూ. 15 లక్షలతో నిర్మించే SC కమ్యునిటీ హాల్ కు శంకుస్థాపన

జల్లపల్లి ఆబాది లో రూ. 16 లక్షలతో నిర్మించే GP భవనం శంకుస్థాపన

రూ. 10 లక్షలతో నిర్మించే ప్రభుత్వ పాఠశాల ప్రహారి శంకుస్థాపన

రూ. 5 లక్షలతో నిర్మించే సేవాలాల్ మహారాజ్ గుడి ప్రహారి శంకుస్థాపన

Related posts

బాసరలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Satyam NEWS

ఆధిపత్య పోరు తో నలిగిపోతున్న గ్రామ ప్రజలు

Satyam NEWS

ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకితీసుకెళ్దదాం…రండి

Satyam NEWS

Leave a Comment