తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరం కలిసి సైనికుల్లా పని చేద్దామని మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు, టిడిపి బందరు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. టిడిపి పార్లమెంట్ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు శుక్రవారం మచిలీపట్నంలోని మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు కార్యాలయంలో కొనకళ్ల ను కలిసి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం సైనికుల్లా పని చేద్దాం అన్నారు.
ప్రభుత్వం నిత్యం చేస్తున్న తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తద్వారా అవగాహన కల్పించి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో ఉన్న భ్రమలను తొలగిద్దాం అన్నారు. అసలైన అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమనే నగ్నసత్యాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. సమయం ఆసన్నమైందని ఈ తరుణంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ నియంత పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చమరగీతం పాడదామన్నారు. ఇందుకోసం నూతన కమిటీ దోహదం కావాలన్నారు .
అవకాశాలను బట్టి అవసరాలను పరిగణలోకి తీసుకొని సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మచిలీపట్నం పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు జరిగిందన్నారు. కమిటీలో అవకాశం దక్కిన వారితో పాటు మిగిలిన నాయకులు ,కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు .
రాష్ట్ర అభివృద్ధి రోజు రోజుకు కుంటు పడుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమనే సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు .లెక్కా పత్రం లేకుండా నిధుల వినియోగం పారదర్శకత లేకుండా పాలన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా టిడిపి శ్రేణులు పనిచేయాలన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు.
తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు, బోడె ప్రసాద్ లను, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభినందించి, ఘనంగా సత్కరించి, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొనకళ్ల నారాయణరావు, బోడె ప్రసాద్ లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పెనమలూరు మాజీ శాసనసభ్యులు ,కమిటీ ప్రధాన కార్యదర్శి బోడె ప్రసాద్, ఉపాధ్యక్షులు, మండలి వెంకట రామ్, టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) మున్సిపల్ మాజీ చైర్మన్, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ కోశాధికారి, మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, మాజీ కౌన్సిలర్, కమిటీ ఆఫీస్ సెక్రెటరీ, బత్తిన దాసు , ప్రచార కార్యదర్శి పి.వి. ఫణి కుమార్, మచిలీపట్నం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు, నిమ్మగడ్డ సత్యసాయి, అధికార ప్రతినిధులు, లంకే శేష గిరి రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, మారకానికి పరబ్రహ్మం, గుడివాడ, అవనిగడ్డ నుండి విచ్చేసిన యార్లగడ్డ భూషయ్య, మైనేని శ్రీనివాసరావు, తూమాటి విజయ్ కుమార్, యార్లగడ్డ రాజేంద్ర ప్రసాద్, గుండె ముని ప్రసాద్, కొలుసు శ్రీమంతం, మణికంఠ తదితరులు పాల్గొన్నారు .