దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం హత్య కేసు నిందితుడు, పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన చెన్నకేశవులు భార్య రేణుక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి రేణుక మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చి చేరింది.
అనంతరం ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రేణుక భర్త చెన్నకేశువులు దిశా హత్యాచారం కేసులో ఏ2గా ఉన్నాడు. అతడి స్వస్థలం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామం. దిశా ఘటన సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.