ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన దాడుల్లో గాయపడిన వారి కోసం మజ్లీస్ పార్టీ నాలుగు లక్షల రూపాయల విలువైన అత్యవసర మందులను అందచేస్తున్నది. ఈ నెల 8న ఈశాన్య ఢిల్లీలో నిర్వహించే వివిధ వైద్య శిబిరాలలో ఈ మందులను బాధితులకు అందచేయాలని ఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయించారు. ప్రస్తుతం సహాయ శిబిరాల్లో నివాసముంటున్న బాధితుల అవసరాలను తీర్చేందుకు ఈ మందులు అత్యవసరం. ఢిల్లీలో ఎంఐఎం ప్రతినిధి బాలిగ్ నోమాని ఈ మందులను బాధితులకు అందచేస్తారు.
previous post