మతిభ్రమించి మాట్లాడుతున్న గుంటూరు జిల్లా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పదవి నుండి భర్తరఫ్ చేయాని, వైస్సార్ పార్టీ నుండి బహిష్కరించాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు.
ఈరోజు స్థానిక రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి,నవ భారత రాజ్యాంగ నిర్మాత డా॥బి.ఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ పొంది వైద్య విద్యను అభ్యసించడమే కాకుండా ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారని మరచిపోయి గతంలో అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళి ఎవరి విగ్రహం ఇది అని ప్రక్కన వారితో అడిగి ఒకసారి అంబేద్కర్ ను అవమాన పరిచారని ఆయన అన్నారు.
మరలా ఒక కులానికి సంబంధించిన సమావేశంలో పాల్గొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారాని రాజ్యాంగ హక్కుల మాత్రం కల్పించింది మాత్రం జగజ్జీవన్ రామ్ అని మాట్లాడారని ఆయన తెలిపారు. అంబేద్కర్ గురించి తెలియని తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడటం సిగ్గుచేటని అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ఆగిపోయిన గుండె మరలా కొట్టుకుంటే లబ్ డబ్ కాకుండా జగన్ జగన్ అని కొట్టుకుంటుందని మాట్లాడారని గుండెలో జగన్ జపం చేస్తున్న ఎమ్మెల్యే శ్రీదేవికి అంబేద్కర్ గురించి ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఐక్యంగా ఉండే దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రసంగాలు ఎమ్మెల్యే మానుకోకపోతే దళితుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఎమ్మెల్యే శ్రీదేవి అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడిన మాటలకు తక్షణమే క్షమాపణ చెప్పకుంటే దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపడతామని తెలిపారు.