29.7 C
Hyderabad
May 6, 2024 03: 19 AM
Slider ప్రత్యేకం

రివెంజ్: నిమ్మగడ్డపై వేటుకు రంగం సిద్ధం

ramesh kumar

కమ్మ కులస్తుడు కావడం వల్లే కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని ఆరోపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పక్కకు తప్పించేందుకు ఎంతో పకడ్బంది ప్లాన్ వేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా చట్ట సవరణ చేసి మరీ రమేష్ కుమార్ పై వేటు వేసేందుకు సిద్ధం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కె) ప్రకారం ఎస్ ఈసిని గవర్నర్ నియమిస్తారు. ఒకసారి నియమించాక, పదవీకాలం 5 ఏళ్లని నిర్ణయించాక, ఆయనను తొలగించే అధికారం పార్లమెంటుకు తప్ప ఎవరికీ లేదు.

హైకోర్టు జడ్జిని తొలగించే విధానమే ఎస్ ఈసి తొలగింపునకు వర్తిస్తుంది. అయితే చట్టాన్ని ఆర్డినెన్సు ద్వారా సవరించి జీవో నెంబర్ 617, 618 లను నేడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైకోర్టు జడ్జి హోదా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని నిర్ణయం తీసుకుంది. కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు కుదించారు. ఈ జీవోల ప్రకారం రమేష్ కుమార్ ని తొలగించే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమంటున్న న్యాయనిపుణులు అంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అవకతవకల పై రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రానికి రమేష్ లేఖ రాసారు. తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని లేఖలో రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసారు.

కరోనా సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సరికాదని నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్ కుమార్ పై ఇప్పుడు వేటు వేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. నిష్పాక్షికంగా వ్యవహరించే అధికారులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మరోసారి రుజువైందంటూ విపక్ష నేతల విమర్శలు చేస్తున్నారు.

శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఈ విషయం పై మండి పడ్డారు. “రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి(ఎస్ ఈసి) పదవీకాలం 5ఏళ్లనుంచి 3ఏళ్లకు తగ్గిస్తూ ప్రతిపాదించిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం.

అధికారులను బెదిరించి, వ్యవస్థలను ధ్వంసం చేసి రాజ్యం చేయాలన్న దుష్ట తలంపుతోనే వైసిపి ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను తెచ్చింది అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి అధికారాలు, నిధుల గురించి 73,74వ రాజ్యాంగ సవరణల్లో స్పష్టంగా చెప్పారు. వైసిపి ప్రభుత్వ చర్యలు 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకం.

ఎన్నికల స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోయేలా వైసిపి ప్రభుత్వం చేస్తోంది అని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 243(కె), ఏపి పంచాయితీరాజ్ చట్టం 1994 సెక్షన్ 200 రెండింటి సారాంశం ఒక్కటే. 73,74 రాజ్యాంగ సవరణల అనుగుణంగానే ఎవరైనా వ్యవహరించాలి. ఈసి నియామకం, పదవీకాలం గురించి రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. పంచాయితీరాజ్ చట్టానికి ఏ సవరణలు చేసినా రాజ్యాంగ పరిధిలోనే జరగాలి. వైసిపి ప్రభుత్వ ప్రతిపాదిత ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం అని అన్నారు.

Related posts

పెద్దశేష వాహనంపై తిరుమల దేవదేవుడు

Satyam NEWS

ఢిల్లీలో మరో సారి భారీ అగ్ని ప్రమాదం

Satyam NEWS

తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment