సెంట్రల్ మాజీ శాసనసభ్యులు టీడీపీ పోలిట్ సభ్యులు బొండా ఉమ ఆదేశాలు మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ విజయవాడ లోని 64 వ డివిజన్ పరిధిలోని అన్ని టీ క్యాంటీన్లు దగ్గర ‘మీతోనే మేము దేనికైనా’ కరపత్రాలను ప్రజలకు పంచారు.
ఈ అరాచక ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేయటాన్ని వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో TNTUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, 64 డివిజన్ ఇంచార్జ్ పలగాని శివ, 62 డివిజన్ ఇంచార్జ్ పైడి.శ్రీను, జిల్లా SC సెల్ ఆధికార ప్రతినిధి వింజమూరి సతీష్, సెంట్రల్ SC సెల్ ప్రధాన కార్యదర్శి బెజ్జం జయపాల్, సీనియర్ నాయకులు S.నాగరాజు, మోతుకూరి.
ఖాసిమ్, తేళ్ల భవాని, SK.బాబు, మల్లేశ్వర రావు, కోరాడ. రమణ, రాజేష్, కుంభా. రమణ, చింతయ్య, రౌతు. మంగరాజు, శివమ్మ, గొర్లె. కోటేశ్వర రావు , బలుగు. ప్రసాద్, జనసేన నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు.