37.2 C
Hyderabad
April 30, 2024 11: 52 AM
Slider కడప

నందలూరు లో114వ రోజు పవన్ అన్న ప్రజా బాట

#prajabata

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం  రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని పాటూరు పంచాయతీలో 114వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి సమస్యలను ఆరా తీశారు.

ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ  మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ కూడా లేకుండా బ్రతుకుతున్నామని ఈ ప్రభుత్వానికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలని ఆ గ్రామ ప్రజలకు వివరించారు. అక్కడ ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ రాబోవు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే స్వేచ్ఛ అభివృద్ధి మార్గంలో నడుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు ,గోపి, పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష,మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాదయాత్ర చేస్తున్న వారిని అరెస్టు చేయడం హేయమైన చర్య

Satyam NEWS

ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎంపిడిఓ గా జోగు శ్రీనివాసరెడ్డి బాధ్యతలు

Satyam NEWS

కరోనా నివారణకు మాస్కులు ధరించకుంటే చర్యలు

Satyam NEWS

Leave a Comment