కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్లను జూకల్ శాసనసభ్యులు హనుమంతు షిండే శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీ మహిళలు ఆరోగ్యవంతంగా ఉండి పండంటి పిల్లలను జన్మనివ్వాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో ఎన్నో పోషక విలువలతో కూడిన ఆహారాలు ఉన్నాయని కావున గర్భిణీ మహిళలు వీటిని తప్పకుండా ప్రతిరోజు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపీపీ యశోద భాయి నీళ్లు పటేల్, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాధవరావు దేశాయి, మద్నూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సాయ గౌడ్, సీనియర్ నాయకులు దాదారావు పటేల్,మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్ స్వామి,స్థానిక తెరాస శ్రేణులు వైద్య ఆరోగ్య సిబ్బంది గర్భిణి మహిళలు ఉన్నారు.
జి. లాలయ్య, సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం