ములుగు జిల్లా కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థి నాగవేల్లి కల్పన ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ఎస్సై ఈవెంట్స్ కు సెలెక్ట్ అయింది. కల్పన తండ్రి స్వామి కల్పన చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి భారతి పక్షవాతంతో మంచానికి పరిమితం అయింది. ఈ పరిస్థితుల్లో కల్పన పట్టుదలతో చదివి పీజీ కంప్లీట్ చేసింది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూనే ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ఎస్సై ఈవెంట్స్ లో సెలెక్ట్ అయింది.
నిరుపేద కావడంతో అప్పన్న హస్తం కోసం ఎదురు చూస్తుండగా ములుగు కు చెందిన అన్నం మోహన్ కుమార్ ద్వారా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ కి కల్పన కుటుంబ పరిస్థితులు తెలిశాయి. తక్షణమే రమేష్ స్పందించి ఆ కుటుంబానికి 3000 రూపాయల ఆర్థిక సాయం ట్రస్టు సభ్యుల ద్వారా చేశారు.
ఈ సందర్భంగా రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు అన్నం మోహన్ కుమార్ గుండెబోయిన రవి గౌడ్ మాట్లాడుతూ కల్పన కుటుంబ పరిస్థితి తెలుసుకొని తోచిన సహాయం చేసినందుకు రామకృష్ణ ట్రస్ట్ సేవాసమితి కి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
గత రెండు సంవత్సరాల నుండి నిరుపేదల అప్పన్న హస్తంగా రామకృష్ణ ట్రస్ట్ వారు చేసిన సేవలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భూక్య శీను, వేల్పు కొండ రఘువీరు, నాగవేల్లి రాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు.