తెలంగాణ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రధానకార్యదర్శిగా ఆకునూరి నరేష్ నియమితులయ్యారు. అదే విధంగా ఉపాధ్యక్షుడుగా గుర్రం సంతోష్ ను నియమించారు.
ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని TSPA ములుగు జిల్లా అధ్యక్షుడు కలువల భద్రయ్య తెలిపారు. ములుగు జిల్లాలో TSPA ను మరింత బలోపేతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య అందించాలనే వత్తిడిని ప్రభుత్వంపైనా, పాఠశాలల పైనా తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.