కొద్ది నెలల క్రితమే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం..88 ఏళ్ల బామ్మ..రామనామం రాయడం ప్రారంభిస్తే ఆ బామ్మ బాటను చాలా మంది అనుసరించడం ప్రారంభించారు.
ఆ కోవలోనే విజయవాడ భావానీపురం రోడ్డ స్వామి శ్రీ రామానంద ఆశ్రమం లో ఉంటున్న శ్రీ శాంతిమయి శరత్ ల బిడ్డ కాత్యాయనీ… ఆ బామ్మ బాటనే ఎంచుకున్నారు.
తండ్రి శతృఘ్నకుమార్…హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేస్తుండగా ఆయన భార్య శ్రీ శాంతి మయి..ఆశ్రమ బాధ్యతలను చూసుకుంటున్నారు.
వారికున్న ఇద్దరు పిల్లలలో పెద్థమ్మాయి ఏడవతరగతి చదువు తున్న కాత్యాయనీ.. ఈ రామ నామం రాయతలబెట్టింది.
ఎనిమిది పదుల వయస్సులోనే రామనామం రాయడాన్ని తలపెట్టిన బామ్మే…అంతటి పని చేస్తే..12 ఏళ్లున్న నేను రాయలేనా అంటూ…రామనామం రాయటాన్ని తలపెట్టింది.
నాలుగు రోజుల క్రితం రామనామాన్ని తలపెట్టిన కాత్యాయనీ.. ఇప్పటి వరకూ దాదాపు 5 వేలకు పైగా “శ్రీరామ” అంటూ రాసింది.
అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం లో ఉడత సాయం చేసేందుకు నాదో చిన్న యత్నమని చిన్నారి చెప్పడం..ఈ ఆధునిక కాలంలో… స్మార్ట్ ఫోన్ లు పట్టుకుని ఉంటున్న పిల్లలందరికీ స్పూర్తి దాయకమనే చెప్పాలి.