ములుగు జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో దీపావళి సంబురాలను ఎస్పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. ఆయన సతీమణి, కుమారుడు, కుమార్తెలతో పాటు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, సీఆర్పీఎఫ్ జవాన్ లకు మిఠాయిలు పంచారు. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, అందరి జీవితాలలో దీపావళి వెలుగులు ప్రసరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకలలో ములుగు సీఐ గుంటి శ్రీధర్ సిబ్బంది పాల్గొన్నారు.
previous post