29.7 C
Hyderabad
April 29, 2024 08: 53 AM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్

DK Aruna

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేస్తే చావు డప్పు కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చావు డప్పులు కొట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునివ్వడం పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చెరిగారు. వడ్లు కొంటామని ఒక్కసారి, కొనము  అని మరోసారి చెప్తూ తెలంగాణ రైతాంగాన్ని మభ్య పెట్టడమే కాకుండా, వడ్లు(బియ్యం) కొంటమని ముందు నుంచి చెప్తున్న బీజేపీ పై బురద చల్లే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నారని డీకే అరుణ  విమర్శించారు. కేంద్రం బియ్యం కొంటామని చెప్తునప్పటికి, ఇంత వరకు వడ్లను సేకరించకుండా కాలయాపన చేస్తూ, రైతుల ఆత్మ హత్యలకు కారణమైతున్నారని డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్య వంతులని కెసిఆర్ మోసపూరిత మాటలు నమ్మి మోసపొరని, కెసిఆర్ కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ ముఖ్యమంత్రికి లేకపోగా, ప్రజల దృష్టి మళ్లించేందుకు తీవ్రంగా ప్రయతనిస్తున్నారని డీకే అరుణ అన్నారు.

Related posts

ఆశా కార్యకర్తలకు చీరలు పంచిన వైద్యాధికారి

Satyam NEWS

కరెక్షన్:విమానాన్నికూల్చివేసినఘటనలో30మందిఅరెస్ట్‌

Satyam NEWS

ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమo

Murali Krishna

Leave a Comment