సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకునే సమయంలో భౌతిక దూరంతో పాటు కోవిడ్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,సిబ్బందికి ఈ నెల 31వ, తేదీ వరకు ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపుగా ప్రతి ఒక్కరూ ఈ టీకాలు వేసుకొని ఉండాలని, వైద్య ఆరోగ్య శాఖ వారితో సమన్వయం చేసుకోవాలని కోరారు.
మధుమేహం, అధిక రక్తపోటు,క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణయ్య,లక్ష్మీ, బందెల రాములు,విజయలక్ష్మి,రాజేష్, సువర్ణ కుమరి,గోవిందమ్మ తదితరులు ఉన్నారు.