28.7 C
Hyderabad
May 5, 2024 10: 41 AM
Slider నల్గొండ

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అధికారి

#DMHO Suryapet

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకునే సమయంలో భౌతిక దూరంతో పాటు కోవిడ్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,సిబ్బందికి ఈ నెల 31వ, తేదీ వరకు ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపుగా ప్రతి ఒక్కరూ ఈ టీకాలు వేసుకొని ఉండాలని, వైద్య ఆరోగ్య శాఖ వారితో సమన్వయం చేసుకోవాలని కోరారు.

మధుమేహం, అధిక రక్తపోటు,క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణయ్య,లక్ష్మీ, బందెల రాములు,విజయలక్ష్మి,రాజేష్, సువర్ణ కుమరి,గోవిందమ్మ తదితరులు ఉన్నారు.

Related posts

ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Murali Krishna

పక్కా గృహాల నిర్మాణంపై ప్రభుత్వ విధానం పై బత్యాల ఫైర్

Satyam NEWS

ఈశ్వరిపురి కాలనీ  సంక్షేమ సంఘం నూతన కమిటి ఎన్నిక

Satyam NEWS

Leave a Comment