కరోనా కారణంగా విధించిన రెడ్ జోన్ ప్రాంతాలలో కరెంటు బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఎంఐఎం పార్టీ నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలీ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారని అన్నారు.
లాక్ డౌన్ ఎత్తేసినా రెడ్ జోన్లు కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అందువల్లే రెడ్ జోన్ లలోని ప్రజలకు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకం కింద రెడ్ జోన్ లోని పేదలకు పని కల్పించి సాయం చేయాలని ఆయన కోరారు. ఆర్ డి వో వెంకటేశ్వరరావు ఎం ఐ ఎం నాయకలు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించారు.