రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తన మంత్రి చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదన్నారు. వ్యాఖ్యలు చేసిన సంబంధిత ఎమ్మెల్యే తో కూడా క్షమాపణలు చెప్పించారు. భారత రాష్ట్రపతిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర మంత్రి అఖిల గిరి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీనికి నిరసనగా పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్భవన్కు ర్యాలీగా వెళ్లారు. ఈ అంశంపై రోజుకో ప్రకటనలు చేస్తూ మాట్లాడుతున్న భాష, అబద్ధాలు ప్రచారం చేయడం ఆమోదయోగ్యం కాదని ఆమె అన్నారు. మాట్లాడటం ఒక కళ అని ఆమె అంటూ నేను కొన్నిసార్లు ‘కింభుత్కీమేకర్’ అనే పదాన్ని ఉపయోగిస్తాను, దీని అర్థం ఆంగ్లంలో వింత. ఇది నిఘంటువులో ఉన్న పదం. నేను డిక్షనరీ వెలుపల ఏ పదాన్ని ఉపయోగించలేదు. నేను ఎప్పుడైనా చెడ్డ పదం చెబితే, నేను దానిని వెంటనే వెనక్కి తీసుకుంటాను అని ఆమె అన్నారు.