గాంధీభవన్లో ఎన్నికల కమిటీ మీటింగ్ కు వనపర్తి కాంగ్రెస్ నాయకులు వెళ్ళారు. చిన్నారెడ్డి హటావో కాంగ్రెస్ కు బచావో ఉంటూ గాంధీభవనం గడప తొక్కి పిసిసి కమిటీ మెంబర్లకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్కకు, మాజీ అధ్యక్షుడు సీనియర్ నాయకులకు మెమొరండం ఇచ్చి వనపర్తి కాంగ్రెస్ ను రక్షించాలని, కాంగ్రెస్ గెలవాలంటే కొత్తవారికి అవకాశం ఇవ్వాలని మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ కోరారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క,మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బీసీ నాయకులు వి. హనుమంతరావుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు, అజారుద్దీన్ కు, పొన్నాల లక్ష్మయ్యకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వనపర్తి పరిస్థితి వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీ డెలిగేట్ శంకర్ ప్రసాద్, మాజీ బీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, సోలిపురం రవీందర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు గంధం రాజశేఖర్, ఉమ్మల రాములు, తిమ్మన్నగారి రాములు, రాజా గౌడ్, వినయ్ రంజిత్, పాండు పాల్గొన్నారు.రేవంత్ రెడ్డిని సన్మానించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్