ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల పట్టభద్రుల ఎలక్షన్ మండల కన్వీనర్ వినయ్ కుమార్, జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదు పత్రాలను గ్రామ ఇన్చార్జి లకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కుమారి సకినల భవాని, కో ఆప్షన్ నెంబర్ రియాజ్ మిర్జా, సర్పంచ్ పోరిక రామ్ కుమార్, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు పోరిక విజయ్ రామ్ నాయక్, ఆత్మ చైర్మన్ బైకనీ ఓదెలు, ఉప సర్పంచ్ పోరిక వినోద్ కుమార్,
గ్రామ శాఖ అధ్యక్షులు పొల బోయిన రఘువరన్, ఎలక్షన్ల గ్రామ ఇన్చార్జి భుర్గు వెంకటేష్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కందగట్ల సారయ్య, పోరిక కష్న నాయక్, బాల్గురి అశోక్, ఉప్పుల శంకరయ్యా, కోర్ర భరత్ కుమార్, బానోతు దేవ్ సింగ్ (బాబీ), నూతన్, అశోక్, ఆజిని, మొబిన్ పాషా, వనం ప్రశాంత్, నిఖిల్, బాల్గురి సత్య, కళ్యాణ్ పాల్గొన్నారు.