అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం లోని సుండువారిపల్లి గ్రామంలో జగనన్న కాలనిలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇంటి పడికట్లు స్లాబ్ కూలి కార్మికుడు నారాయణ (58) దుర్మరణం పాలయ్యాడు. కాలనీలో జగనన్న ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇంటి నిర్మాణం చేయడానికి గుత్తి కి చెందిన వలస కార్మికుడు నారాయణ భార్యతో వచ్చాడు. భోజన విరామ సమయంలో భార్య భోజనం తేవడానికి వెళ్లగా, నారాయణ సమీపంలో ఉన్న పడికట్ల నీడలో కూర్చున్న సమయం లో జరిగిన దుర్ఘటన జరిగింది. పడి కట్లు శిథిలాల కింద నారాయణ చిక్కుకోగా జె.సి.బి. సహాయంతో తొలగించి మృత దేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. శనివారం నాడు జరిగిన ఈ ఘటన ను గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగు చూసింది.
previous post
next post