మీ కాళ్లకు మొక్కి చెబుతున్నా. నా మాట వినండి. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ కు మాత్రం పోవద్దు. ఆగమైపోతారు…. అంటూ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నారు శాంతినగర్ పోలీసులు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన శాంతి నగర్ పోలీసులు వాడవాడకు తిరిగి మరీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు కు ఎట్టిపరిస్థితుల్లో పోవద్దని చెబుతున్నారు.
అమ్మలారా అక్కలారా కరోనా నుంచి మానవ జాతిని కాపాడుకోవడానికి అందరూ సహకరించాలని చెబుతూ అనారోగ్య సమస్యలు చిన్నవిగానీ పెద్దవి గానీ వస్తే శాంతి నగర్ కు దగ్గరలో ఉన్న కర్నూలుకు వెళతారేమో అమ్మలారా అక్కలారా వెళ్లద్దు అని చెబుతున్నారు. చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వడ్డేపల్లిలో డాక్టర్ కు చూపించుకోండి. మరింత పెద్ద సమస్య అయితే గద్వాలగానీ మహబూబ్ నగర్ వెళ్లండి. కొంచెం దూరమైనా హైదరాబాద్ పోండి కానీ అక్కలారా తల్లులారా రాయలసీమకు అందులోనూ కర్నూలుకు మాత్రం పోవద్దు అని వివరంగా చెబుతున్నారు శాంతి నగర్ పోలీసులు.