26.7 C
Hyderabad
May 3, 2024 10: 53 AM
Slider గుంటూరు

యువగళం కు సంఘీభావంగా టీడీపీ యాత్ర

#tdp

యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ ఇన్ చార్జి డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. దీంతో నరసరావుపేటలోని గుంటూరు రోడ్ జనసంద్రంగా మారింది. పసుపు జెండాలతో,డిజె పాటలతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకున్నారు. బాణాసంచా కాల్చి తమ అభిమాన నాయకుడు చదలవాడ అరవింద బాబు అడుగులో అడుగు వేస్తూ తెలుగుదేశం జిందాబాద్,అరవింద బాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సాగారు. సైకో పోవాలి సైకిల్ రావాలంటూ నినదిస్తూ నరసరావుపేటలో అరవింద బాబు సారు జోరు ఆపే మగాడు ఎవడు అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అరవింద బాబు పై పూలవర్షం కురిపించి,తీన్మార్ డప్పులతో ప్రతి రోడ్డులో పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు.

Related posts

ఈ శనివారం సెలవు లేదు

Sub Editor 2

చెన్నమనేని పౌరసత్వం చెల్లదంటే చెల్లదు అంతే

Satyam NEWS

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు కరోనాతో మృతి

Satyam NEWS

Leave a Comment