కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదడిగి గ్రామ పంచాయతీలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న మేత్రి సాయిలు ను బదిలీ చేయరాదంటూ గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం ఇన్చార్జి ఎంపీడీవో సుధాకర్ ను వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి విజయవంతంగా పనులు చేపట్టి తమ గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపించారన్నారు. అటువంటి నిస్వార్ధ ఉద్యోగి తమకే కావాలని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దదడిగి గ్రామస్తులు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.