కర్ణాటక బెలగావిలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ సైన్సెస్ ఫ్యాకల్టీలో సిబిఐటి కళాశాల సిఎస్ఇ విభాగం లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి రమణా రెడ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ పొందారు. ఆయన క్లౌడ్ కంప్యూటింగ్ వాతావరణంలో వనరుల కేటాయింపు పథకం కోసం ఆప్టిమైజేషన్ విధానాలు మీద స్టడీ చేసారు. ఈ సందర్భంగా బి రమణ రెడ్డి మాట్లాడుతూ క్లౌడ్ కంప్యూటింగ్లో అందుబాటులో ఉన్న కంప్యూటింగ్ వనరులను సమర్ధవంతంగా ఉపయోగించడం అనేది క్లౌడ్ ప్రొవైడర్లకు అత్యంత సవాలుగా ఉన్న సమస్యలలో ఒకటి. క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్ పనితీరులో కీలక పాత్ర పోషించగల సమర్థవంతమైన మరియు సరైన టాస్క్-షెడ్యూలింగ్ వ్యూహం రూపకల్పనకు దీని అవసరం. క్లౌడ్ వాతావరణంలో టాస్క్ షెడ్యూలింగ్ను మెరుగుపరచడానికి అనేక విధానాలు ఉన్నప్పటికీ, తాను కనిపెట్టిన విధానం ఎంతో సమర్థవంతం గా పనిచేస్తుంది అని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహులు, సిఎస్ఇ విభాగాధిపతి ప్రొఫెసర్ రమణ్ దుగ్యాల, ఇతర అధ్యాపకులు అభినందించారు.
previous post