23.7 C
Hyderabad
May 8, 2024 06: 05 AM
Slider ముఖ్యంశాలు

హుజూర్ నగర్ వాసి తండు హరికృష్ణ గౌడ్ కు డాక్టరేట్ పురస్కారం

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సీనియర్ బయో కెమిస్ట్ తండు హరికృష్ణ గౌడ్ కు డాక్టరేట్ పురస్కారం లభించింది.

‘క్లినికల్ బయోకెమిస్ట్రీ,ఐసోలేషన్ అండ్ క్యారక్టరైజేషన్ ఆఫ్ స్టెమ్సెల్స్ ఫ్రమ్ హ్యూమన్ ఫిటసు’విభాగంలో చేసిన పరిశోధనలకు గాను గ్లోబల్ యూనివర్సిటీ ఐన సెంట్రల్ క్రిష్టియన్ యూనివర్సిటీ నుండి శనివారం ముంబైలో ఈ డాక్టరేట్ పురస్కారాన్ని హరికృష్ణ అందుకున్నారు. హరికృష్ణ గౌడ్ 10 వతరగతి వరకు స్థానిక హుజూర్‌నగర్ పట్టణంలోని చైతన్య హైస్కూల్ లో,ఇంటర్ విద్యను గుంటూరు సిద్ధార్థ కాలేజీలో చదువుకుని,ఆ తర్వాత బిఎస్సి బయోటెక్నాలజీ డిగ్రీ చేసి వైజాగ్ గీతం కాలేజీలో మెడికల్ బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు.అదేవిధంగా ఎల్ఎల్.బి పూర్తి చేసిన తర్వాత మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణుడైనాడు.

ప్రస్తుతం హుజూర్ నగర్ పట్టణంలోని హరికృష్ణ డయాగ్నస్టిక్ సెంటర్ కు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.తన తండ్రి తండు వెంకటనర్సు గౌడ్ జ్ఞాపకార్ధం టివియన్ ఫౌండేషన్ పేరు మీద డయాగ్నస్టిక్ సెంటర్ లో ఆరు నెలలకు ఒకమారు ఉచితంగా బ్లడ్ టెస్టులు,పట్టణ వాసుల సేద తీరడానికి పలు చోట్ల సిమెంట్ బెంచీలు,అన్నదానం వంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న తండు హరికృష్ణ గౌడ్ డాక్టరేట్ పొందడం పట్ల పట్టణ ప్రముఖులు,విద్యావేత్తలు, మిత్రులు తమ హర్షం వ్యక్తం చేశారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నిన్నటి వరకూ క్లాసులు చెప్పిన టీచర్లు వీరు…

Satyam NEWS

యాసిడ్ తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

రాజేంద్రప్రసాద్ మల్టీ జానర్ చిత్రం “క్లైమాక్స్” మార్చి 5న రిలీజ్!!

Satyam NEWS

Leave a Comment