28.2 C
Hyderabad
May 9, 2024 00: 40 AM
Slider గుంటూరు

యాసిడ్ తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

#womenconstable

పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగమల్లేశ్వరి (24)  యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తక్షణమే గుర్తించి ఆమెను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. మాచర్ల రూరల్ స్టేషన్ లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. గురువారం కంభంపాడు గ్రామ సమీపంలోని నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద యాసిడ్ తగినట్లు సమాచారం.  ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగమల్లేశ్వరిని స్థానికులు గమనించి మాచర్ల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్ఐ ఆదిలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరిని మాచర్ల ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు  జీజీహెచ్ కు తరలించారు. లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

మంత్రి ముందు మాజీ ఎమ్మెల్యే అనుచరుల నిరసన

Satyam NEWS

జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

Satyam NEWS

బర్డ్‌లో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు

Bhavani

Leave a Comment