పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నందు నిర్వహిస్తున్న శాశ్వత అన్నదాన కార్య క్రమానికి కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు కు చెందిన వెంకటేశ్వర అవిర్నేని తారక బ్రహ్మం మరియు దోన వ ల్లి పుష్పఅవతి చారిటబుల్ ట్రస్ట్ 4 లక్షల రూపాయలు విరాలంను ఆలయ ఈఓ జి వి సుబ్బారెడ్డికి అందజేశారు.
ఈ విరాళం తో పాలాద్రి గోత్రానికి చెందిన అవిర్నేని సాంబశివరావు పేరున ప్రతిరోజు అన్నదానం జరిపించాలని కోరారు. ఇంతటి భారీ విరాళాన్ని అందించిన వెంకటేశ్వర అవిర్నేని తారక బ్రహ్మం ను ద్వారకా తిరుమల అన్నదాన ట్రస్ట్ తరపున ఈ ఓ సుబ్బారెడ్డి మహా అన్నదాతగా ప్రకటించి స్వామివారి అన్నదాన బాండ్ ను బహుకరించారు.
తారక బ్రహ్మం తో పాటు ఆయన వెనుక వచ్చిన బంధు మిత్రులకు స్వామివారి దర్శనం చేయించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.