కృష్ణాజిల్లా విజయవాడ ప్రసాదం పాడుకు చెందిన మల్లం పాటి పూర్ణ కిశోర్ పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్థాన శాశ్వత అన్నదాన ట్రస్ట్ కి విరాళం అందచేశారు.
అన్నదాన ట్రస్ట్ కార్యనిర్వహణాధికారి కి గురువారం 1 లక్ష 1.116 రూపాయలు విరాళం అందజేశారని దేవస్థానం ఈ ఓ జి వి సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ విరాళంతో పూర్ణకిశోర్ బంధువైన కంచర్ల గోత్రానికి చెందిన పునుకోల్లు శివరామకృష్ణ పేరున నవంబర్ 9వ తేదీన అన్నదాన కార్యక్రమం జరిపించాలని కోరారని ఈ ఓ తెలిపారు.
అన్నదాన కార్యక్రమానికి విరాళం అందించిన పూర్ణకిశోర్ ఆయన కుటుంబ సభ్యులను దేవస్థానం తరపున గౌరవ మర్యాదలు అందించి దేవస్థానం తరపున వస్త్రాన్ని బహుకరించి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేసామని ఈ ఓ చెప్పారు.