పశ్చిమగోదావరిజిల్లాలోని ద్వారాకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో కార్తీక పౌర్ణమి నాడు అన్నదానం జరిపించడానికి ఓ భక్తుడు భారీ విరాళం అందచేశారు.
అన్నదాన ట్రస్ట్ కి మంగళవారం నాడు మొత్తం లక్షా 16 వేల 116 రూపాయలు విరాళం అందజేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడు కు చెందిన సి హెచ్.కోటేశ్వరరావు, ఆయన బంధువులు బొమ్మదేవర చటర్జీ, సత్యవతి పేర కార్తీక పౌర్ణమి రోజున అన్నదానం జరిపించాలని ఆయన ఈ విరాళాన్ని స్వామివారి సన్నిధిలో అన్నదాన ట్రస్ట్ కార్యదర్శికి అందజేశారు.
ఈ విషయాన్ని చిన్న తిరుపతి దేవస్థానం ఈ ఓ జీవి సుబ్బారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.