హుజూర్నగర్ పట్టణంలో గూండాల దాడికి గురైన జర్నలిస్టు సైదులు గౌడ్, సింగమోహన్ రావు లను నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు, జిల్లా యంత్రాంగం అవినీతి,అక్రమాలను బయటపెట్టిన వారిపై దాడిని ఆయన ఖండించారు.హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ను సందర్శించి పక్షపాతంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు.
అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీ నేతల ఇష్టానుసారం పని చేస్తున్నందున తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రపతి పాలనలో నిర్వహించాలని,ఈ విషయాన్ని పార్లమెంట్లో డిమాండ్ చేస్తానని అన్నారు.తెలంగాణలో టిఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని,ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు,సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,బాచిమంచి గిరిబాబు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు కస్తాల శ్రవణ్ కుమార్,కోతి సంపత్ రెడ్డి, కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్