రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి దేవాలయ శిలా మండప నిర్మాణానికి శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపక వంశీయులు కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాద రావు, పద్మావతమ్మ దంపతులు రూ.1,00,000 ల విరాళం గద్వాల జిల్లా మల్దకల్ మండల వాల్మీకి పూజారులకు ఆదివారం అందజేశారు. దేవాలయ కార్యాలయంలో వాల్మీకి పూజారులు కుండికాళ్ల సమక్షంలో ఈ విరాళాన్ని అందజేశారు.
గత పది సంవత్సరాల క్రితం మల్దకల్ లో వాల్మీకి విగ్రహ ప్రతిష్ట చేయగా చిన్న గర్భగుడి నిర్మించారు. ఆ దేవాలయాల్ని శిలామండప దేవాలయముగా మలిచేందుకు వాల్మీకి పూజారులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రహ్లాద రావు మాట్లాడుతూ వాల్మీకి కులస్తులకు ఆరాధ్య దైవమైన మహర్షి వాల్మీకి విగ్రహాన్ని దేవాలయ స్థలమైన సర్వేనెంబర్ 339లో గతంలో నెలకొల్పడం జరిగిందని, శిలా మండప నిర్మాణం చేస్తే శాశ్వతంగా ఉంటుందని తాను తనవంతుగా విరాళం అందజేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి పూజారులు, కొండికాళ్ళు, ఎమ్మిగనూరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.