30.7 C
Hyderabad
April 29, 2024 03: 03 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ కు నాలుగు బంగారు పతకాలు

#wanaparthy

ఇండియన్ రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్రం జిల్లాల వారీగా ఉత్తమ సేవలకు గాను 2019-2020, 2020-201, 2021-2022 వార్షిక సంవత్సరములకు గాను  బంగారు పతకాలు, సేవా పతకాలను ప్రకటించింది. అందులో భాగంగా వనపర్తి జిల్లాకు నాలుగు  బంగారు పతకాలు నాలుగు సేవా పతకాలు లభించాయని వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్                  ఖాజా కుతుబుద్దిన్  తెలిపారు.

బంగారు పతకాలు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా పరిషత్ సి. ఈ. ఒ.వెంకట్ రెడ్డికి ఎమ్.వెంకటేశ్వర్లు మాజీ తహశీల్దార్ కొత్తకోటకు ప్రకటించగా జిల్లా సుపెరిండెంట్ అఫ్ పోలీస్  కే. అపూర్వరావు ఐ. పి. యస్.కు సేవాపతకం, మరో ముగ్గురుకి సేవా పతకాలు ప్రకటించారని వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఖాజకుతుబుద్దిన్ తెలిపారు. వీరికి 15న (గురువారం)హైదరబాద్ రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో జరగనున్న ప్రత్యేక వార్షిక సర్వ సభ్య సమావేశం లో రాష్ట్ర గవర్నర్  డాక్టర్ తమిళ సై సౌందర రాజన్  పతకాలను అందచేసి సన్మనించటం జరుగుతుందని ఆయన తెలిపారు. అవార్డ్ గ్రహీత లకు వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యులు జిల్లా రెడ్ క్రాస్ మండల కమిటీ సభ్యులు అభినందనలు తెలియచేశారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

చివరికి ఎమ్మెల్యేలను బతిమాలుకుంటున్న సీఎం జగన్

Satyam NEWS

గంజాయి కోసం ఆబ్కారీ అధికారుల వేట

Satyam NEWS

వర్ష బాధితులకు కొల్లాపూర్ ఎమ్మెల్యే సొంత సాయం

Satyam NEWS

Leave a Comment