40.2 C
Hyderabad
May 5, 2024 18: 39 PM
Slider విజయనగరం

మందిర నిర్మాణం కోసం.. ప్రజల వద్ద నుంచీ నిధి సేకరణ..!

#Ranateerdham

అయోధ్య లో రామమందిర నిర్మాణ విషయంలో యావత్ భారత జాతి ని భాగస్వాములు  చేయాల‌ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్ణ‌యించింది.

ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం బాబామెట్ బీవీకే హైస్కూల్లో అందుకు సంబంధించి క్షేత్ర నిర్వాహ‌కుల‌కు పాంప్లేట్ విడుద‌ల చేసారు.

జ‌న‌వ‌రి 15 నుంచీ 30 వ‌ర‌కు అయోధ్య‌లో ప్ర‌తిష్టాత్మ‌కమైన రాముని దేవాల‌య నిర్మాణ‌మున‌కు సంబంధించి యావ‌త్ దేశ ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచీ ప‌దిరూపాయ‌ల నుంచీ నిధి స‌మ‌కూర్చేందుకు విరాళాలు సేక‌రిస్తున్న‌ట్టు నిర్వాహ‌కుడు పిడుగు  ఉమాశంక‌ర్ తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో  నగరంలో ప్రముఖులు పాల్గొని, రామాలయం నిర్మాణం కోసం నిధి సమర్పణ ఉద్యమం ప్ర‌తీ గడప గడపకూ చేరుస్తామ‌ని తెలిపారు.

ఇందుకు కోసం యావ‌త్ హిందూ సమాజం స‌మాయ‌త్తం కావాల‌ని..శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్ణయించింది.

ఈ కార్య‌క్ర‌మంలో రామనారాయణ ట్రస్ట్ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త, కొండా రెడ్డి డా. డీవీవీ కృష్ణం రాజు,  Rss విభాగ్ సంఘచాలక్, సోమయాజులు, ఇంటర్ నేషనల్ రామాయణ ఉపన్యాసాకులు, నారాయణం శ్రీనివాసులు పాల్గొన్నారు.

Related posts

బాబ్రీ మసీద్ పై తీర్పు ఎలా ఉన్నా స్వాగతిద్దాం

Satyam NEWS

సీరియల్ చూడొద్దని చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

Bhavani

మహారాష్ట్ర పాలిటిక్స్: మళ్లీ కదులుతున్న ముళ్ల కంప

Satyam NEWS

Leave a Comment