ఆంధ్రప్రదేశ్ లో దేవుళ్ల విగ్రహాలు పగలగొట్టడం చూసి తెలంగాణలో కూడా నేర్చుకుంటున్నారు.
బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోకవర్గంలో పెంట్లవెల్లి మండలం కేంద్రంలోని సవరమ్మ దేవర విగ్రహాన్ని పగలగొట్టారు.
గురువారం ఈ విషయంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు.
కారకులను వెంటనే పట్టుకోవాలని రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తపరిచారు. తాహసిల్దార్,పోలీస్ ల హామీతో నిరసన విరమించారు.