40.2 C
Hyderabad
May 2, 2024 17: 38 PM
Slider వరంగల్

దళారులను నమ్మి మోసపోవద్దు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్థికాభివృద్దియే లక్ష్యంగా ప్రవేశపెట్టిన దళిత బందు పథకాన్ని దళారులు ఆసరగా చేసుకుని దళితుల వద్ద నుండి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఎవ్వరు దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోకూడదని ములుగు జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఈ మేరకు పత్రికా విలేకరులతో ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బందు పథకం అర్హులైన వారికి అందుతుందని అన్నారు. దళిత బందు విషయంలో ఎవరైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు దళితులకు మోసపూరిత మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసి నట్టు తమ దృష్టికి వస్తే పార్టీ క్రమ శిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. దళిత బందు పథకానికి అర్హులైన వారి ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని దళితులు గమనించాలని సూచించారు.

Related posts

సంపన్నుల జాబితాలో చేరిన బ్రిటన్ ప్రధాని రిషి

Bhavani

మోడీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడితేనే కేసీఆర్‌కు మద్దతు

Murali Krishna

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు

Satyam NEWS

Leave a Comment