ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు పావని, స్వాతి, శ్రావణి, ,చైతన్య, సజ్జు ,అనిత, మేఘన తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల సమస్యలపై గళం విప్పనున్న కోదండరాం
25న ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ గళం విప్పనున్నారని, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధికార ప్రతినిధి, పొలిటికల్ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షులు కత్తెరపల్లి భాస్కర్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో పొలిటికల్ జేఏసీ మరియు కాంగ్రెస్ నాయకులతో బొడ్రాయి దగ్గర నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి రెండుసార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది అని, పదవ తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని, ఇంటర్ ఫలితాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఉద్యోగం సాధించాలని అహర్నిశలు కష్టపడుతున్న నిరుద్యోగులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల పునాదుల మీద నిర్మించబడిన బిఆర్ఎస్ పార్టీ డిసెంబరు 3 ఎన్నికల ఫలితాల తర్వాత కకా వికలం కాబోతుందని డిసెంబర్ 9న తెలంగాణలో క్యాబినెట్ మంత్రిగా ఆదివాసి ముద్దుబిడ్డ, ప్రజా నాయకురాలు సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర దోపిడీని మించి దోపిడీకి పాల్పడిన కెసిఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని, కెసిఆర్ దుష్ట పాలనను అంతం చేసి తెలంగాణను రక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
25 శనివారం రోజున ములుగు లో పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం విచ్చేయుచున్న సమావేశానికి ములుగు జిల్లాలోని మేధావులు, నిరుద్యోగులు, ప్రజలు, ఉద్యమకారులు, రైతులు, మహిళలు, కర్షక కార్మిక వర్గాలు పార్టీలకతీతంగా భారీ ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చింతనిప్పుల బిక్షపతి, అహ్మద్ పాషా, ఎల్లావుల అశోక్, ఇమ్మడి రాజు, దూడబోయిన వేణు, ఓం ప్రకాష్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.