39.2 C
Hyderabad
May 3, 2024 13: 05 PM
Slider నిజామాబాద్

బీడీ కార్మికులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి

#citukamareddy

బీడీ కార్మికులకు డబులు బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాల మంజూరు కోరుతూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద తాసిల్దార్ కు సి ఐ టియూ వినతిపత్రం అందచేసింది. అనంతరం సి ఐ టి యూ జుక్కల్ నియోజకవర్గ కన్వీనర్ సురేష్ గొండ మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం లో ఉన్న బీడీ కార్మికులందరికి ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, పెన్షన్ లేని వారందరికీ పెన్షన్ మంజూరు చెయ్యాలని, ప్రతి ఒక్కరికి హేల్త్ కార్డు లు ఇవ్వాలని, బీడీ కార్మికులందరికి బీడీ కంపెనీ ల యజమానులు ఇన్సూరెన్స్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామానికి చెందిన బీడీ కార్మికుల ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమం లో బీడీ కార్మికుల నూతన కమిటి అధ్యక్షురాలు ఎం. విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఎస్. రుక్మిణి, ప్రధాన కార్యదర్శి కె. కవిత. సహాయ కార్యదర్శి కె. గోవిందమ్మ, డి. లక్ష్మి. కోశాధికారి డి. కళావతి.తోపాటు సి ఐ టి యు నాయకులు బి. ఆడేప్ప. కె. శ్రీనివాస్ రావు. కె. సుభాష్ బీడీ కార్మికులు పాల్గొన్నారు.

జి. లాలయ్య  సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

వడ్లు కొనే దాకా వదిలేది లేదు

Sub Editor 2

పేపర్ ప్లేట్లు అడిగిన వారిపై బావర్చి సిబ్బంది దౌర్జన్యం

Satyam NEWS

సంత్ సేవాలాల్ మహరాజ్ యువతకు ఆదర్శప్రాయుడు

Satyam NEWS

Leave a Comment