గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అంబేద్కర్ చౌరస్తా లో బంజారాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్టి మోర్చా అధ్యక్షులు ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ దేశంకోసం హిందు ధర్మంకోసం ఆయన చేసిన సేవలు కొనియాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం పని చేశారు అని అన్నారు. కేవలం గిరిజనుల అభ్యున్నతి కోసంమే కాకుండా భారత సాంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయులు అని కొనియాడారు. అలాగే సేవాలాల్ మహరాజ్ మానవమాతృడు కాదు అని దైవంశసంభూతుడని అన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అని అన్నారు. దేశం పట్ల ధర్మం పట్ల ఆయన ఎంతో అంకిత భావంతో ఉండేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో లకావత్ గోపాల్ పిట్లం మండలం అధ్యక్షుడు అభినయ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు నరసింహ రాజు జనరల్ సెక్రటరీ సాయి రెడ్డి మైనార్టీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ టౌన్ ప్రెసిడెంట్ వడ్ల శివ కుమార్ తండా సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం