29.7 C
Hyderabad
May 2, 2024 06: 42 AM
Slider ఖమ్మం

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు త్వరగా పూర్తి చేయాలి

#Double bedroom

సత్తుపల్లి పట్టణం లో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూం ఇండ్ల పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణంలో ఉన్న 46 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. త్రాగునీరు, డ్రయినేజి, సంప్ పనులను ఆయన పరిశీలించారు.

పనులు పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అనంతరం నిర్మాణంలో వున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనుల పురోగతిని తనిఖీలు చేశారు. మొదటి అంతస్తులో చేయాల్సిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.

పనులు పూర్తి చేసి వ్యాపారులకు అందుబాటులో తేవాలన్నారు.కలెక్టర్ తనిఖీల సందర్భంగా కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమీషనర్ సుజాత, అధికారులు తదితరులు వున్నారు.

Related posts

పోలీసు బాస్ ఆకస్మిక తనిఖీ.. ఈ సారి ఏ స్టేషన్ అంటే…!

Satyam NEWS

నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం

Bhavani

‘‘ఢిల్లీ లిక్కర్’’ పుట్టలో నుంచి ఏ పాము బయటికొస్తుందో..?

Satyam NEWS

Leave a Comment