విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక నేడు కొత్తవలస పీఎస్ ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషను ప్రాంగణాన్ని పరిశీలించి, రికార్డులు, సిడి ఫైల్స్ తనిఖీ చేశారు. అనంతరం, పోలీసు సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులతో జిల్లా ఎస్పీ మమేకమై, వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దేశపాత్రునిపాలెం గ్రామ యువతకు కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా వాలీబాల్, క్రికెట్ కీట్స్ పంపిణీ చేశారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని, స్టేషను వచ్చిన బాధితుల సమస్యలు సావధానంగా విని, వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, న్యాయ స్థానాలు నుండి త్వరితగతిన సీసి నంబర్ల పొందాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాల సూర్యారావు, ఎస్ఐలు దేవి, వెంకటేశ్వర రావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
previous post