ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పై ఆయన భార్య ప్రియా వరకట్న వేధింపుల కేసు పెట్టారు. పెళ్లి జరిగినప్పటి నుంచి నా భర్త నన్ను మానసిక, శారీరక చిత్రహింసలు పెడుతున్నారు. మా చెల్లెలు రాధిక గోయల్ ఢిల్లీలో ఉన్నప్పుడు సచిన్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
సచిన్ నా పేరుతో ఉన్న అన్ని ప్రాపర్టీలను తన పేరుపై బదిలీ చేసుకోవడానికి ప్రయత్నించాడు. నేను తిరస్కరించినప్పుడు గత ఏడాది అక్టోబర్ 20న సచిన్ నాపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడు. కట్నం కోసం నన్ను మానసికంగా, శారీరకంగా హింసించాడు అని ప్రియా బన్సల్ ఎఫ్ ఐఆర్ లో ఆరోపించింది. తన పెళ్లికి తన తండ్రి రూ. 50 లక్షలు ఖర్చు చేశాడని, 38 ఏళ్ల బన్సాల్ కు కూడా రూ .11 లక్షలు ఇచ్చాడని ప్రియా తెలిపింది. బెంగళూరు నగరంలోని కోరమంగళ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.