మంత్రి రోజాను నగరిలో అసమ్మతి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సొంత పార్టీలోనే వర్గ పోరు ముదిరింది. నగిరి నియోజకవర్గం వడమాల పేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు వైకాపా బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఏలుమలై, శ్రీశైలం బోర్డు మెంబర్ చక్రపాణి రెడ్డి (నిండ్ర) ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కేజీ శాంతి, ఆమె భర్త మాజీ మున్సిపల్ ఛైర్మెన్ కేజే కుమార్, విజయపురం ఎంపీటీసీ లక్ష్మీపతి రాజు మంత్రి రోజా పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఐరన్ లెగ్ గా పేరుపొందిన రోజా ని గెలిపించి గోల్డెన్ లెగ్ గా మార్చామన్నారు. అయితే రోజా సోదరులు చేస్తున్న అవినీతి అక్రమాలు మితిమీరిపోయాయని వారు తెలిపారు. రోజా భర్త సెల్వమణి తమకు వారే పదవులు ఇచ్చినట్లు చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. రోజా సీటు కేటాయిస్తే ఓడిస్తామని హెచ్చరించారు.
previous post
next post