రాష్ట్రంలో మూడో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్,కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. అందుకు కారణం ఎవ్వరంటే..మాత్రం అటు రెవిన్యూ సిబ్బంది ఇటు పోలీసులే.
ఎలాంటి పొరపాట్లు జరగకుండా కాస్త ఆలస్యం అయినా రెవిన్యూ సిబ్బంది అతి జాగ్రత్తగా కౌంటింగ్ నిర్వహణ పూర్తి చేస్తే…అంతకు ముందు ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా,ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చేయడంలో మాత్రం పోలీసులకు హేట్సాప్ చెప్పక తప్పదు.
మరీ ముఖ్యంగా చౌడవాడ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనలో ఊహించని విధంగా జరిగిన గలాటాలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిషోర్ కుమార్ చాక చక్యంగా, సమయస్సూర్తితో వ్యవహరించి బ్యాలెట్ బాక్స్ లను కాపాడటమే కాకుండా..జరిగిన ఘటన హింసాత్మకంగా మారకుండా చూడటంతో..సాక్షాత్ ఎలక్షన్ కమీషనర్ మెచ్చుకోవడం విశేషం.
అలాగే…ఆ ఘటన నిమిషాలలో అక్కడ జరిగిన దృశ్యం సోషల్ మీడియాలలో చక్కెర్లు కొట్టింది. దీంతో డీఎస్పీ అనిల్..చాకచక్యంగా వ్యవహరించారు. స్థానిక పోలీసుల నుంచీ వాస్తవాలు తెలుసుకుని…ఆ వీడియోను మీడియాకు విడుదల చేయటంలో పోలీసు పీఆర్ఓ పీవీఎస్ఎస్ కోటేశ్వరరావు కీలక పాత్ర పోషించారు.
అలాగే ఈ ఇద్దరితో పాటు సూర్యనారాయణ, నాగమణి, రమేష్ లకు కూడా జరిగిన పంచాయితీ ఎన్నికలలో సమర్దవంతంగా విదులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ అయదుగురు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజకుమారీ స్వయంగా తన ఛాంబర్ కు పిలిపించి….వెయ్యి రూపాయల నగదు..సర్టిఫికెట్ తో సత్కరించారు. ఈ అయిదుగురు సమర్ధవంతంగా విధులు నిర్వహించడంలో….తమకు స్పూర్తి దాయకం…ఎస్పీ రాజకుమారీ యేనని చెప్పడం విశేషం.
ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్, విజయనగరం