బాగ్ అంబర్ పేట డివిజన్ బతుకమ్మకుంట లోని (వీకర్ సెక్షన్) లో 8 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ పద్మావెంకట్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ మాజీద్, డీఎంఓ రజిత, ఎలక్ట్రికల్ ఏఈ సౌమ్య, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, బాగ్ అంబర్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రమోహన్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్